బైక్ లపై ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పాలసముద్రం ఎస్సై రాజశేఖర్ మంగళవారం సూచించారు. వాటిని ధరించకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా ట్రాక్టర్ వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు అతికించుకోవాలని తెలిపారు. అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్ పనికిరాదని.. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తామని చెప్పారు.