అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.డీఎస్పీలు, సి.ఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్ల మరియు ఇతర రాష్ట్రాల మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో మరియు పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. ఆయా గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.అనంతరం... గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు.