వికారాబాద్: జిల్లాలో జరిగే సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ఇప్పటివరకు 60% పూర్తి అయ్యాయి: కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్ల పనులు ఇప్పటివరకు 60 శాతం పూర్తి చేసుకున్నామని, మిగతా 40% పనులు కూడా పెండింగ్లో ఉంచకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో జరిగే సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయిన వాటికి ఎఫ్టీఓ జనరేట్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.