డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జి ఏ మహేష్ పిలుపునిచ్చారు. గురువారం ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు, కోర్టు న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. మోటార్ వాహన కేసులు ఎక్కువ మోతాదులో పరిష్కారం అయ్యే విధంగా చూడాలని తెలియజేశారు. ఎక్కువ సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.