అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో ఎస్ఐ శివ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు భద్రత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను ధరించి గ్రామంలోని కాలనీలలో ర్యాలీ చేపట్టారు. గ్రామంలో ప్రయాణికులకు హెల్మెట్ల ప్రాముఖ్యతను ఇదేవిధంగా సీట్ బెల్ట్ ధరించడం పైన అవగాహన కల్పించారు. అనంతరం స్టేషన్లో పలువురి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పోలీసులతో కలిసి ఎస్సై పంపిణీ చేశారు.