శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లి లో విద్యుత్ సరఫరా లో ఎక్కువగా అంతరాయం ఏర్పడుతోందని హిందూపురం విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద మరమ్మగాల కార్మికులు ఆందోళన నిర్వహించారు. మరమగాలపై దాదాపు 300 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని కరెంటు కోతలతో ఆ కుటుంబాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని తెలిపారు. సరి అయిన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.