కర్నూలు జిల్లాలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని , అదే విధంగా భూములకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తులను పెండింగ్ ఉండకుండా సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రీ సర్వే, మ్యుటేషన్ తదితర అంశాల పై జాయింట్ కలెక్టర్ ఆర్డీవోలతో, తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..