అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం మూడు గంటల 50 నిమిషాల సమయంలో అమరావతి లో డిప్యూటీ పవన్ కళ్యాణ్ చాంబర్ నందు రాప్తాడు నియోజకవర్గ సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి ఆత్మకూరు మండలాలకు సంబంధించిన నీటి సమస్య అనేక గ్రామాల్లో రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు 11 కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వినీత పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.