పెదచెర్లోపల్లి: రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానం చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
India | May 6, 2026
పెదచెర్లోపల్లి మండలంలోని శ్రీ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్లలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో విజేతలకు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి బుధవారం బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి ఏటా శ్రీ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ల ను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరునాళ్ల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి తరలివచ్చి రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే అభినందించారు.