ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆగస్టు 3న ప్రజా సమస్యల పరిష్కార వేదిక: నిర్వహణ అధికారులు వెల్లడి
Ongole Urban, Prakasam | Aug 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఆగస్టు మూడవ తేదీ సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఆదివారం ఎస్పీ కార్యాలయం నిర్వహణ అధికారులు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలపై ఎస్పీ హర్షవర్ధన్ రాజును నేరుగా కలిసి అర్జీలు ఇవ్వవచ్చని ఇచ్చిన అర్జీలను ఎస్పీ పరిశీలించి పరిష్కరిస్తారని కార్యాలయ నిర్వహణ అధికారులు వెల్లడించారు. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.