అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ట వార్షిక ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి ఏక వార రుద్రాభిషేకం, గణపతి హోమం నవగ్రహ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేద పండితులు చిరంజీవి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయం వద్ద వార్షిక ఉత్సవంలో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సేవా కమిటీ సభ్యులు దాతలు కలిసి నిర్వహించారు.