ఆచంట: భట్లమగుటూరు సమీపంలో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం భట్లమగుటూరు సమీపంలో మార్టేరు నుంచి అత్తిలి వెళ్లే ప్రధాన రహదారిపై ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన కారులో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు.