గుంతకల్లు: గుత్తి పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో భారత రాష్ట్ర మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు అబూబాకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ బీహార్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త అన్నారు.