మండపేట: మండపేట నియోజవర్గంలో నామినేషన్లు పర్వం ఆరంభం... తొలి రోజు మూడు నామినేషన్లు..
మండపేట నియోజవర్గంలో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉదయం ఆరంభమైంది. కాగా తొలి రోజు మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు మండపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎల్లారావు స్థానిక మీడియాకు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు, నవతరం పార్టీ నుంచి ఒకరు నామినేషన్లు వేశారని ఆయన తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి కోన సూర్య భాస్కర్రావు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి మార్ని సత్యనారాయణ తన నామినేషన్ దాఖలు చేశారు. నవతరం పార్టీ అభ్యర్థిగా జర్నలిస్టు నంది కోళ్ల రాజు తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి అందజేశారు.