శ్రీశైలం: బండిఆత్మకూరు మండలం పార్నపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేసిన MLA బుడ్డా
బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో MLA బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్నారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.