సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం దాదులూరు గ్రామంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి దాదులూరు పోతులయ్య స్వామి వారి జాతరను ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతులయ్య స్వామి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మాట్లాడుతూ దాదులూరు గ్రామంలో శ్రీ దాదులూరు పోతులయ్య స్వామి వారి జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగిందని రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా దాదులు పోతులయ్య స్వామి వారి జాతరను నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భక్తులు దాదులు పూతలయ్య స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.