అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో 44వ నంబర్ జాతీయ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామానికి చెందిన నబీరసూల్ అనే వ్యక్తి అనంతపురంలోని అశోక్ లైల్యాండ్ లారీ షోరూమ్ లో మెకానిక్ గా పని చేసేవాడు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో పని ఉండటంతో ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. అయితే గుత్తి శివారులోని కాసేపల్లి టోల్ గేట్ సమీపంలో నబీరసూల్ గుత్తి వైపునకు వస్తుండగా కాసేపల్లి గ్రామానికి చెందిన సునీల్ రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్న సమయంలో రెండు బైక్ లు పరస్పరం ఢీ కొన్నాయి.