అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మొదినావాద్ ప్రాంతంలో రైల్వే క్వార్టర్స్ లో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమరాలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు సీసీ టీవీ దృశ్యాలను సోమవారం విడుదల చేశారు. పట్టణంలోని మొదినాబాద్ రైల్వే క్వార్టర్స్ లో నాలుగు ఇళ్లలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడిన విషయం తెలిసిందే. నాలుగు ఇళ్లలో ముగ్గురు చోరీలో పాల్గొనగా వారిలో ఇద్దరు ముసుగు ధరించగా మరో వ్యక్తి ధరించకుండా పారిపోతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి.