దర్శి: కురిచేడు మండలం బోధనంపాడులో మహిళా దారుణ హత్య.. కేసు యొక్క వివరాలను వెల్లడించిన : త్రిపురాంతకం సీఐ అస్సాన్
Darsi, Prakasam | Apr 13, 2025 కురిచేడు మండలం బోధనంపాడు వద్ద లక్ష్మి అనే మహిళా దారుణ హత్యకు గురి కాగా కేసు యొక్క వివరాలను త్రిపురాంతకం సీఐ అస్సాన్ ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను బలంగా గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో కొట్టడంతోనే చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించామని, మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.