శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం ఏఈఓ వెంకటేశ్వరరావు, అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామికు రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారుకు కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు స్వామి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలు కేఎస్ జవహర్కు అందజేశారు.