రాయపర్తి: మైలారం ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు.
వరంగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. రాయపర్తి మండలం మైలారం ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి పాఠశాల తరగతి గది ముందు ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విధంగా పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు అక్కడి సన్నివేశాలు చూసి ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజలు చేశారని పాఠశాల వర్గాలు చెబుతుంటే మరికొందరు ఇది ఆకతాయిల పని అంటూ చెప్పుకొస్తున్నారు.