మహబూబాబాద్: ఇనుగుర్తి మండలం రామ్కీ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు మృతి..
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం రాంకీ తండా వద్ద సోమవారం సాయంత్రం 4:00 లకు చోటుచేసుకుంది. నెక్కొండకు చెందిన వెంకట్ రాములు నర్సింహులపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.