ధ్యానం చేయడం వల్ల మనసిక ప్రశాంతత వస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. డిశంబర్ 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా.. రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ గోడ పత్రికలను మంత్రి సోమవారం ఉదయం 11 గంటలకు కర్నూలు లోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ధ్యానంతోపాటు యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలని మంత్రి తెలిపారు.