కర్నూలు లో చికెన్, మటన్ పాపులను రాష్ట్ర మాంసాభివృద్ది సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు అధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని పలు షాపులకు వెళ్లి నిబంధనలు పాటిస్తున్నారా లేదా పరిశీలించారు. పరిశుభ్రంగా లేని షాపులకు జరిమానాలు విధించారు. నాణ్యత లేని చికెన్ షాపుల్లో చికెన్ పై బ్లీచింగ్ పౌడర్ చల్లారు. మటన్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించి నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చైర్మన్ సూచించారు. ఈకార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్. మల్దన్న, పుడ్ ఇన్స్ ఫెక్టర్, రాజగోపాల్ రావు పాల్గొన్నారు.