గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో గొర్రెలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం వెటర్నరీ వైద్యులు మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గొర్రెలు మేకల పెంపకం దారుల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాసులు గొర్రెల కాపరులు పెద్ద రాముడు, చిన్న రాముడు పరామర్శించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.