అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని అంకంపల్లి గ్రామంలో గురువారం రైతు జంగమ గంగాధర కు చెందిన గడ్డివాములకు నిప్పంటుకొని మంటలు చెలరేగి కాలిపోయాయి. గ్రామంలో స్థిర నివాసాలు సమీపంలోని గడ్డివాములు ఉండటంతో స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. విపరీతమైన గాలి కారణంగా మంటలు వ్యాప్తి చెంది గడ్డివాములు కాలిపోయాయి. కళ్యాణదుర్గం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో గ్రామానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా అదుపు చేసింది. అగ్ని ప్రమాదంలో సుమారు లక్ష వరకు నష్టం చేకూరిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.