అమరజీవి పొట్టి శ్రీరామలు కృషి తోనే దేశంలో అనేక బాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని రాష్ట్ర మంత్రి టీజీ. భరత్ అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు పొట్టి శ్రీరాములు 73వ వర్థంతి సందర్భంగా చిన్న అమ్మవారి శాల వద్ద నున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి టీజీ. భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ.సిరి అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జయంతి, వర్థంతి వేడుకలను అధికారికంగా ప్రకటించిన ఘనత తెలుగు దేశం పార్టీ కే దక్కిందని మంత్రి తెలిపారు.