అనంతపురం నగరంలోని రామ్ నగర్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం నగరంలోని రాంనగర్ ఓవర్ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో అనంతపురం నగరానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.