కర్నూలు నగరంలోని 52 వార్డుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువుల్లోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇంజనీరింగ్ విభాగ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆయన రూ.25 కోట్ల అభివృద్ధి పనుల పురోగతిని, వార్డుల వారీగా సమీక్షించారు.రూ.23 కోట్లు సాధారణ నిధులతో, రూ.1.50 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులతో, రూ.60 లక్షలు ఎన్క్యాప్ నిధులతో జరుగుతున్న పనులపై కమిషనర్ పురోగతి వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యత, వేగం, పర్యవేక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.