శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం ఆలయ పూజారిపై కళ్ళలో కారం కొట్టి దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
శ్రీశైలం ఆలయంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న శ్రీశైలం టీవీ ఉద్యోగిపై దాడి ఘటన మరువకముందే.. నేడు ఆలయ అర్చకుడు మల్లికార్జునపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. విధుల నిర్వహణకు వెళ్తున్న సమయంలో దేవస్థానం వర్క్షాప్ సమీపంలో కాపుకాసిన దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మల్లికార్జున గట్టిగా అరవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.దాడి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సుండిపెంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.