శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి మరియు సమస్యలపై ముఖ్యమంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
అమరావతి సచివాలయంలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిధుల విడుదల, శ్రీశైలం–మహానంది క్షేత్రాల అభివృద్ధి, రహదారి విస్తరణ, చెంచు గూడెంలకు మౌలిక సదుపాయాలు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, తెలుగుగంగ ప్రాజెక్ట్, కేసీ కెనాల్ సహా సాగునీటి అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. అలాగే శ్రీశైలం భక్తులు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దోర్నాల–ఆత్మకూరు జాతీయ రహదారి విస్తరణను చేపట్టాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.