కొండపి: సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ ఫెస్టివల్ కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు సమీక్ష నిర్వహించిన సీఐ హజరతయ్యా
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీలలో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు నేపథ్యంలో పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సింగరాయకొండ సర్కిల్ సీఐ హజరతయ్యా బుధవారం తెలిపారు. ఈ విధంగా సిబ్బంది పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఐ వారికి సూచించారు.