కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఈ నేపథ్యంలో బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందుల పట్టణంలోని శ్రీ మిట్ట మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మున్సిపల్ వైసీపీ ఇన్చార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి తో కలిసి ఆయన ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.