అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్నయ్య నగర్ వద్ద జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జాతీయ సేవా పథకం అడ్వైజర్ కమిటీ సమావేశంలో ఉపకులపతి సుదర్శన్ రావు ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జెఎన్టియు విశ్వవిద్యాలయ పరిధిలో జాతీయ సేవా పథకం అడ్వైజర్ కమిటీ మీటింగ్ 2025 26 సంవత్సరం సంబంధించిన బడ్జెట్ చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి కొన్నిటిని ఆమోదించడం జరిగిందని జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.