స్కూటీ పై నుంచి పడిపోయిన మహిళను, ఆమె ఏడేళ్ల కుమారుడిని క్షణాల వ్యవధిలోనే ఆర్మీ వాహనం ఢీకొని, వారి పై నుంచి వెళ్లింది. సికింద్రాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ పాఠశాల సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లికి గాయాలయ్యాయి. బాధిత మహిళ తన కొడుకును పాఠశాలకు తీసుకెళ్తుండగా ఇది జరిగింది. ఆ బాలుడి తండ్రి జమ్మూకశ్మీర్లో జవాన్గా సేవలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.