ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు కు సంబంధించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు..