ఒంగోలు అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీ క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపిన కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 31, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు పేర్కొన్నారు.శుక్రవారం ముండ్లమూరు మండల పరిషత్ కార్యాలయంలో దర్శి నియోజకవర్గస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీతో తో కలిసి జిల్లా కలెక్టర్ పీ.రాజా బాబు నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ అనంతరం జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో సుమారుగా 176 పైచిలుకు అర్జీలు అందాయన్నారు.