శ్రీశైలం: శ్రీశైలం శిఖరేశ్వరం సమీప అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం
శ్రీశైలం శిఖరేశ్వరం సమీప అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. కొండ ప్రాంతంలోని అటవీ విస్తీర్ణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతూ కనిపించాయి. దూరం నుంచే మంటలు, పొగలు స్పష్టంగా కనిపించడంతో స్థానికులు మరియు అక్కడికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. శిఖరేశ్వరం పరిసర ప్రాంతం దట్టమైన అడవులతో పాటు కొండ ప్రాంతంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో వాటి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొనింది.