శ్రీశైలం: ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామంలో పొలం తగాదా విషయంలో టిడిపి మైనారిటీ నాయకుడు షపి పై దాడి
ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామంలో పొలం తగాదా విషయంలో మధ్యవర్తిత్వం చేసిన టిడిపి మైనారిటీ నాయకుడు షపిపై అదే పార్టికి చెందిన కొందరు నాయకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన షపి మాట్లాడుతూ, కేవలం పొలం వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరించినందుకే వ్యక్తిగత కక్ష పెంచుకుని తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, తనపై జరిగిన దాడిపై పార్టీ నాయకత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.