అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి పట్టణానికి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై టోల్ గేట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో గుత్తి పట్టడానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.