శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం మరవ కొత్తపల్లి క్రాస్ సమీపంలో విరాట్ ప్యాలెస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అంజినప్ప కర్ణాటక రాష్ట్రం, గుడిబండ తాలూకా కోరేపల్లి గ్రామానికి చెందిన వారు అని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు