కనిగిరి: చిన్న గొల్లపల్లిలో చెన్నకేశవ స్వామి, ఆంజనేయస్వామి ఆలయాల పున: నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి
హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో రూ.1.95 కోట్లు వ్యయంతో నూతనంగా నిర్మించనున్న శ్రీ చెన్నకేశవ స్వామి,శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాల పునర్నిర్మాణ పనులకు కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేద పండితులను నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల పునః నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం హర్షనీయమన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు.