గుంతకల్లు: గుత్తి అర్ఎస్ లో అనాథ విద్యార్థిని దత్తత తీసుకున్న రామాంజనేయులు అనే రైల్వే ఉద్యోగి, అభినందించిన కార్మికులు
గుత్తి అర్ఎస్ కు చెందిన రైల్వే ఉద్యోగి రామాంజనేయులు తల్లిదండ్రులు లేని అనాధ విద్యార్థినిని దత్తత తీసుకుని తన మానవత్వం చాటుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను బుధవారం రైల్వే వర్గాలు తెలిపాయి. యాడికి మండలం రాయలచెరువు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న లక్ష్మీ అనే విద్యార్థినికి తల్లిదండ్రులు లేరు. ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న గుత్తి అర్ఎస్ లో రైల్వే ట్రాక్ మేస్త్రి రామాంజనేయులు మానవత్వంతో స్పందించి ముందుకు వచ్చారు. విద్యార్థి లక్ష్మీ చదువు పూర్తి అయ్యేవరకు ఖర్చులు పూర్తిగా భరిస్తానని హామీ ఇచ్చారు.