కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య
సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పట్లను ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య , ఓడా చైర్మన్, ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్, సింగరాయకొండ సిఐ హజరతయ్యా గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిక ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నట్లు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య తెలిపారు.