సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మంగళవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న పంజాబ్ వర్సెస్ బరోడా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఫ్రీ ఎంట్రీ కావడంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందు నుంచి భారీ క్యూ లైన్ లో కనిపించాయి. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండే లాంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండటంతో అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించారు.