కవాడిగూడలోని TRLD కార్యాలయంలో తెలంగాణ రాజకీయ కూటమి నాయకులు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమిలోని వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. కూటమి సెక్రటరీ జనరల్ కపిలవాయి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని అన్ని పార్టీలు ఏకతాటిపై కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను సమిష్టిగా ఎదుర్కొని, ఎన్నికల్లో విజయాన్ని సాధించడమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతుందన్నారు. అలాగే “బీసీలకే రాజ్యాధికారం” అనే నినాదాన్ని మరింత బలోపేతం చేయడమే తెలంగాణ రాజకీయ కూటమి ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.