సంక్షేమ హాస్టల్లో మరియు పాఠశాలలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్... రైతుల నుండి ధాన్యం సేకరణ, ప్రజల నుంచి వివిధ అంశాలపై సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సిటిజన్ సర్వే, సంక్షేమ హాస్టళ్లలో పారిశుధ్యం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.