జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి దుర్గ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయిన సందర్భంగా భవాని మాలాధారణ చేపట్టే దీక్షపరులు సోన్ గోదావరి లో పుణ్య స్నానాలను ఆచరించారు. భవాని మాలాధారణ చేపట్టే వస్త్రాలను ధరించి గోదావరి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాల్లో గోదావరిలో భక్తులు పుణ్యాత్నానాలు ఆచరించడం ఆనవాయితీ. దీంతో గోదావరి ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి.