గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపరిచిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.మనోరమ
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్టేషనరీ, ఇతర ముఖ్యమైన సామగ్రి శనివారం సాయంత్రం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి చేరుకున్నాయి. ఓ ప్రత్యేక వాహనంలో వచ్చిన మెటీరియల్ని ఎలమంచిలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.మనోరమ స్థానిక గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఏఆర్వోలు, ఇతర ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.