కనిగిరి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న బిఈడి మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు సోమవారం నాడు ప్రశాంతంగా ముగిశాయి.స్క్వాడ్ బృందం విజయ్ కుమార్, హర్ష ప్రీతమ్,శ్రీనివాసులు, పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. చివరి రోజు జరిగిన ఫిజికల్ సైన్స్ పరీక్షకు మొత్తము 228 గాను 220 మంది హాజరైనట్లు మిగతా 8 మంది గైర్హాజరు అయినట్లు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిశీలకుడు సాకం కాశిరెడ్డి,సి.ఎస్ మస్తానమ్మ తెలిపారు.